రీఎంట్రీపై మంచు మనోజ్ అప్‌డేట్.. భావోద్వేగంతో ట్వీట్

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో సినిమాలు తీసే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. అయితే కెరీర్‌లో సరైన హిట్ లేక సతమతమవుతోన్న మనోజ్ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 14, 2020, 11:26 AM IST
రీఎంట్రీపై మంచు మనోజ్ అప్‌డేట్.. భావోద్వేగంతో ట్వీట్

మీకు శుభవార్త చెబుతా అంటూ నాన్చిన మంచు మనోజ్ ఎట్టకేలకు తన కెరీర్ మీద అప్ డేట్ ఇచ్చారు. మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నానంటూ ట్వీట్ చేశారు మనోజ్. అహం బ్రహ్మాస్మి పోస్ట్‌ను ట్వీట్ చేస్తూ మంచు వారి అబ్బాయి భావోద్వేగానికి లోనయ్యారు. తొలి మూవీ సమయంలో ఎలాంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. కెరీర్ మొదలైనప్పటి నుంచీ తనకు మద్దతు తెలిపిన వారికి, తనపై ఆప్యాయత చూపిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. సినితల్లి వచ్చేవా.. లవ్ యూ డార్లింగ్ అని ట్వీట్ చేశారు.

ఫొటో గ్యాలరీ: భారత్‌కు వచ్చిన మరో విదేశీ అందం అదితి 

ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు మనోజ్. ‘దొంగ దొంగది’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మనోజ్ సక్సెస్ కోసం నిరంతరం తపిస్తున్నారు. కానీ కథల ఎంపికలో చిన్నచిన్న పొరపాట్లతో సరైన్ హిట్ అందుకోలేకపోయారు. కానీ విభిన్న కథాంశాలకు జై కొట్టే నటులలో మంచు మనోజ్ ఒకరు. మూడేళ్లు సుదీర్ఘ విరామం తీసుకున్న మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’తో మీ ముందుకు రానున్నారు. మార్చి 6న సినిమా గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని ట్వీట్‌తో స్పష్టం చేశారు.

Also Read: నెటిజన్ ‘పెంట’ కామెంట్‌పై అనసూయ ఏమన్నారంటే! 

ఫొటో గ్యాలరీ: సెగలురేపుతోన్న నేపాల్ మోడల్.. ఫొటోలు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News