Honey Moon Express: విజయేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా విడుదలైన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'లోని రెండో సాంగ్..

బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ రచయతగా.. దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన ఎన్ఆర్ఐ ప్రొడక్షన్ పతాంపై తెరకెక్కిన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌' మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. కళ్యాణ్ మాలిక్ సర్వపరిచిన ఈ పాటను ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాబాయి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేయడం గమనార్హం. తాజాగా విడుదలైన పాటలో అనురాగ్ కులకర్ణి పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2024, 11:46 AM IST
Honey Moon Express: విజయేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా విడుదలైన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'లోని  రెండో సాంగ్..

Honey Moon Express - Vijayendra prasad: బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ రచయతగా.. దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన ఎన్ఆర్ఐ ప్రొడక్షన్ పతాంపై తెరకెక్కిన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌' మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. కళ్యాణ్ మాలిక్ సర్వపరిచిన ఈ పాటను ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాబాయి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేయడం గమనార్హం. తాజాగా విడుదలైన పాటలో అనురాగ్ కులకర్ణి పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పాట విడుదల కార్యక్రమానికి గోపీమోహన్, చైతన్య ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ వంటి  పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అటు ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి, అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి వారు వీడియో కాల్స్ తో టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.  శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా కీరవాణి తన తమ్ముడైన కళ్యాణి మాలిక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇటీవల విడుదల అయిన నిజమా పాట అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. తాజాగా విడుదలైన రెండో పాట కూడా సూపర్ హిట్ కావాలని చిత్ర యూనిట్ కోరింది.

Also read: RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు

రీసెంట్‌గా ఈ మూవీలోని మొదటి పాటను రామ్ గోపాల్ వర్మ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ ఎంటర్టేనర్‌లో చైతన్య రావు, హెబ్బా పటేల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోనుందని చెబుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు బాల శేఖరుని గతంలో  రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. కొన్ని సినిమాలకు సహకారం అందించాడు. ఇప్పుడు దర్శకుడిగా బాల రాజశేఖరుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్‌ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు.ఈ మూవీ విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News