chiranjeevi: పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించిన పద్మ విభూషణ్ చిరంజీవి..

chiranjeevi: చిరంజీవికి తాజాగా కేంద్రం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కేంద్రం మరికొందరు తెలుగు వాళ్లకు పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పద్మ అవార్డులు వరించిన తన తోటి కళాకారులను చిరు ఇంటికి పిలిచి వారిని గౌరవించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 30, 2024, 07:47 PM IST
chiranjeevi: పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించిన పద్మ విభూషణ్ చిరంజీవి..

Padma Vibhushan - Chiranjeevi: పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా  తెలంగాణకు చెందిన యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, డాక్టర్ ఆనందచారి వేలును ప్రత్యేకంగా తన ఇంటికి  ఆహ్వానించి సత్కరించారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యెక్షగాన కళాకారుడిగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రలో పాపులర్ అయ్యారు.  1994 తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభ పురస్కారం, 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్నారు. 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.  

ఇక యాదాద్రి ఆలయాన్ని సంపూర్ణంగా కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో డాక్టర్‌ ఆనందచారి వేలు కీలక భూమిక పోషించారు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా అహర్నిశలు కృషి చేశారు. అష్టభుజి మండప ప్రాకారాలు కాకతీయ, ద్రవిడ, చోళ శిల్పకళా రీతిలో తీర్చిదిద్దేందుకు ఎంతో  కష్టపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలిదశలో శిక్షణ పొంది, మొదటిసారి ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.   

అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి ఆనందం వెలిబుచ్చారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసారు.యాదాద్రి ఆలయాన్ని  కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని చిరు కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవిని తమను ఇంటికి ఆహ్వానించి సత్కరించడాన్ని జీవితంలో మరిచిపోలేమన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News