'కంచెరపాలెం' దర్శకుడితో 'బాహుబలి' నిర్మాతల చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ .. ఆర్కా మీడియా మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Last Updated : Dec 26, 2019, 09:54 AM IST
'కంచెరపాలెం' దర్శకుడితో 'బాహుబలి' నిర్మాతల చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ .. ఆర్కా మీడియా మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని .. ఈసారి తక్కువ బడ్జెట్ లో ఓ మళయాల సినిమా రీమేక్ తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. మళయాలంలో హీరో ఫాజిల్ నటించిన సినిమా 'మహేశింతే ప్రతీకారమ్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అరక్ వ్యాలీలో పూర్తి చేసుకుందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కేవలం 36 రోజుల్లోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేయడం విశేషం. 
ఏప్రిల్ 20న విడుదల
ఈ సినిమాకు 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. చిన్న చిత్రం   `కేరాఫ్ కంచ‌పాలెం` తో తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ సినిమా 20 ఏప్రిల్ 2020న రిలీజ్ కానుందని సమాచారం. హీరో సత్యదేవ్ సినిమాలో కథానాయకుడుగా నటిస్తున్నారు.

Trending News