Allu Arjun Wax statue: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైన‌పు విగ్ర‌హం కొలువుతీరేది ఆ రోజే..

Allu Arjun Wax statue Madame tussauds: హీరో అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. త్వరలో ఈయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2024, 08:32 AM IST
Allu Arjun Wax statue: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైన‌పు విగ్ర‌హం కొలువుతీరేది ఆ రోజే..

Allu Arjun Wax statue Madame tussauds: టాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై అన్నట్టు వెనకాల కొండంత మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ 'పుష్ప' సినిమాలోని నటకు జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు నుంచి తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణ భారత దేశం నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా కూడా అల్లు అర్జునే. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ .. అల్లు డాక్యుమెంటరీ చేసిన సంగతి తెలిసిందే కదా. మన దేశంలో ఈ ఘనత అందుకున్న ఫస్ట్ నటుడు అల్లు అర్జునే కావడం విశేషం. ఇలా తన పేర ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను పెట్టే మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పెట్టోబోతున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్‌కు సంబంధించిన కొలతలు తీసుకున్న మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు ఈ నెల 28న దుబాయ్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుక కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నాడు. పుష్ప గెటప్‌లో ఈ విగ్రహం ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈ లిస్టులో చేరాడు.
లతో పంచుకుంటున్నారు. అంతేకాదు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటి కప్పుడు తెలియజేస్తున్నాడు.

ఇక అల్లు అర్జున్ గత సినిమా పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు సుకుమార్ ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం.

అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. అరవ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. ఇక అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ.  ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్ డీటెల్స్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా  తెరకెక్కించబోతున్నారట.

తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News