Allu Arjun Instagram Followers: అల్లు అర్జున్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్కడు..

Allu Arjun Instagram Followers: టాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది 'పుష్ప' మూవీతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్ స్టార్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 21, 2024, 09:22 AM IST
 Allu Arjun Instagram Followers: అల్లు అర్జున్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్కడు..

  

Allu Arjun Instagram Followers: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే ఫుల్ ఫామ్‌లో దూసుకపోతున్నాడు. అదే సమయంలో బ్రాండింగ్ విషయంలో కూడా దూకుడు చూపిస్తున్నాడు. ఇక 2021లో సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప - ది రైజ్' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. ఆ సంగతి పక్కనపెడితే.. అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేసాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 25 మిలియన్స్ కు చేరింది. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఈ రికార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. అంతేకాదు 2 కోట్ల 5 లక్షల మంది అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఆరున్నర యేళ్లలో అల్లు అర్జున్ ఈ మైల్ స్టోన్ అందుకున్నాడు. బన్ని .. 2017 నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటి కప్పుడు తెలియజేస్తున్నాడు.

ఇక అల్లు అర్జున్ గత సినిమా పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో 365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు సుకుమార్ ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.  ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. అరవ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. ఇక అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ.  ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్ డీటెల్స్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా  తెరకెక్కించబోతున్నారట.

తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.

Also read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News