Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..

Petrol price Today: దేశంలో పెట్రోల్ ధరల మంట ఆగటం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధర పెరుగుతూ వాహనదారులకుకు మోయలేని భారంగా మారుతోంది. తాజాగా డీజిల్ ధరలు కూడా పలు నగాల్లో రూ.100 దాటింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 12:22 PM IST
  • వానహాదారులకపై పెరుగుతున్న పెట్రో భారం
  • తాజాగా దాదాపు రూపాయి వరకు ధరల పెంపు
  • హైదరాబాద్​లో లీటర్ డీజిల్ రూ.100 పైకి..
Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..

Petrol Price in India: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో ధరలు పెరగట ఇది ఎనిమిదవసారి. బుధవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో దాదాపు రూపాయి చొప్పున పెరిగాయి. దీనితో గత 8 రోజుల్లో పెట్రోల్ ధర రూ.5.60 చొప్పున పెరిగింది.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల వల్లే.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.

ప్రస్తుత ధరలు ఎంతంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్​ ధర లీటర్​ 80 పైసలు పెరిగింది. దీనితో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.101.05 వద్ద ఉంది. ఇక రూ.92.31 వద్దకు చేరింది.

హైదారాబాద్​, వైజాగ్​లో రేట్లు..

హైదరాబాద్​లో పెట్రోల్ ధర లీటర్​ 91 పైసలు పెరిగి రూ.114.5 వద్దకు ఉంది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి.. రూ.100.69 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా 88 పైసలు, 83 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్ ధర రూ.115.16 వద్ద, డీజిల్ ధర లీటర్​ రూ.101.02వద్ద ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు..

  • చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ రూ.106.68 వద్ద (76 పైసలు పెరిగింది) ఉంది. లీటర్ డీజిల్ ధర 76 పైసలు పెరిగి 96.74 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి లీటర్​ రూ.106.44 వద్ద విక్రయమవుతోంది. లీటర్ డీజిల్ ధర 79 పైసలు పెరిగి రూ.90.47 వద్దకు చేరింది
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.115.86 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 85 రూ.100.08 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 84 పైసలు, 80 పైసల చొప్పున పెరిగింది. దీనితో లీటర్ పెట్రోల్​ రూ.110.50 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.95.4 వద్ద ఉన్నాయి.

Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గుతున్న బంగారం ధరలు

Also read: Fedex CEO: మరో దిగ్గజ సంస్థకు భారతీయుడి నాయకత్వం- ఫెడ్​ఎక్స్​ సీఈఓగా రాజ్​ సుబ్రమణియం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News