Gold Price Today 28th December 2020: బంగారంతో పోటీపడి పెరిగిన వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Rate Update 28th December 2020: డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. ఒకరోజు ధర పెరగడం, మరో రెండు రోజులు తగ్గుతుంది. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 28, 2020, 12:04 PM IST
  • బులియన్ మార్కెట్‌లో మరోసారి పెరిగిన బంగారం ధరలు
  • తాజాగా రూ.51 వేల మార్క్ చేరిన 10 గ్రాముల బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.73 వేలు దాటిన 1 కేజీ వెండి ధరలు
Gold Price Today 28th December 2020: బంగారంతో పోటీపడి పెరిగిన వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Price Today 28th December 2020: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. ఒకరోజు ధర పెరగడం, మరో రెండు రోజులు తగ్గుతుంది. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.390 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,100కి ఎగసింది.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధర (Gold Price Today)లలో  ఏ మార్పు లేదు. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర నిన్నటిలాగే రూ.53,230 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై ధర సైతం నిన్నటి ధరతో ట్రేడ్ అవుతోంది. గత నాలుగు రోజుల మాదిరిగానే ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.48,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే  

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలతో పోటీపడి మరి వెండి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్‌ తొలి అర్ధభాగంలో భారీగా పెరిగి, ఇటీవల తగ్గిన వెండి ధరలు తాజాగా పుంజుకున్నాయి. అయితే ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడో రోజులు తగ్గిన వెండి ధర తాజాగా భారీగా పెరిగింది. తాజాగా రూ.1,900 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.69,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.73 వేల మార్కులో ట్రేడ్ అవుతోంది. తాజాగా రూ.2,200 మేర పుంజుకోవడంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.73,400కి ఎగబాకింది. 

Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News