Gold Price Today In Hyderabad: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు పైపైకి

Last Updated : Nov 1, 2020, 06:25 AM IST
  • బులియన్ మార్కెట్‌లో తాజా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
  • దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి
  • వెండి ధర రూ.800 పెరిగి 1 కేజీ ధర రూ.61,000కి చేరుకుంది
Gold Price Today In Hyderabad: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు పైపైకి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా, అదే దారిలో వెండి ధరలు పయనిస్తున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.280 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.260 పెరగడంతో ధర రూ.47,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

ఢిల్లీ మార్కెట్‌లో మూడు రోజు వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.220 మేర పెరగడంతో  10 గ్రాముల ధర రూ.52,670కి పుంజుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,200కు చేరుకుంది.

 

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) ఓ మోస్తరుగా పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000కు చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News