Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ... రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2349కే..

Flipkart Offers: తక్కువ ధరలో టాప్ బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బిగ్ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 1, 2022, 02:43 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్
  • స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు
  • రూ.15,499 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2349కే
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ... రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2349కే..

Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కస్టమర్లకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. షూస్ మొదలు స్మార్ట్ ఫోన్ల వరకు అన్ని రకాల వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. చౌక ధరలో ఫేవరెట్ బ్రాండ్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి దీన్ని మించిన ఛాయిస్ ఉండదనే చెప్పాలి. ఈ ఆఫర్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు కూడా చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో కేవలం రూ.2349కే పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం డిస్కౌంట్ :

వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.20,000. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 22 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను రూ.15,499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. దీని కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే మరో 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. మరో రూ.774 వరకు ఆదా అయినట్లే. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగగా రూ.14735కే పొందవచ్చు.

భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. టీవీ కండిషన్‌ను బట్టి గరిష్ఠంగా రూ.13,150 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.15,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని రూ.2349కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే నేటి (జూలై  1) నుంచి ఆదివారం (జూలై 3) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారు ఈలోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Viral News: ఇలాంటి కరెన్సీ నోట్, నాణెం మీ వద్ద ఉంటే లక్షల రూపాయలు పొందే ఛాన్స్.. ఎలాగో తెలుసుకోండి..  

Also Read: Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News