Stock Market today: స్టాక్ మార్కెట్లపై కరోనా పంజా- కుప్పకూలిన ఐటీ షేర్లు

Stock Market today: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు గురువారం బ్రేక్​ పడింది. కొవిడ్ భయాలతో సూచీలు భారీ నష్టాలతో (stocks closing bell) ముగిశాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 03:57 PM IST
  • స్టాక్ మార్కెట్లలో మరోసారి కరోనా భయాలు
  • నాలుగు రోజుల లాభాలకు బ్రేక్​
  • 60 వేల మార్క్ కోల్పోయిన సెన్సెక్స్​
Stock Market today: స్టాక్ మార్కెట్లపై కరోనా పంజా- కుప్పకూలిన ఐటీ షేర్లు

Stock Market today: స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల (stocks closing bell)  లాభాలకు బ్రేక్​ పడింది. గురువారం సెషన్​లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 621 పాయింట్లు నష్టపోయి 59,601 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 179 పాయింట్ల నష్టంతో 17,745 వద్ద స్థిరపడింది.

ఇటీవల వరుసగా లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లను మళ్లీ కరోనా భయాలు వెంటాడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా నష్టాలు నమోదైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 59,781 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  59,290 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,798 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,655 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 7 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 23 కంపెనీలు డీలా పడ్డాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 1.74 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.46 శాతం, మారుతీ సుజుకీ 1.13 శాతం, టైటాన్​ 0.79 శాతం  బజాజ్​ ఫినాన్స్ 0.67 శాతం, లాభాలను నమోదు చేశాయి.

అల్ట్రాటెక్​ సిమెంట్​ 2.58 శాతం, టెక్​ మహీంద్రా 2.42 శాతం, హెచ్​సీఎల్​టెక్ 2.01 శాతం, హెచ్​డీఎఫ్​సీ 2.01 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్​ 2.01 శాతం నష్టపోయాయి. 

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీ లాభాలను నమోదు చేసింది. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు భారీగా నష్టపోయాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి 13 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ (Rupee Value today) రూ.74.49 వద్ద కొనసాగుతోంది.

Also read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి పసిడి ధరలు

Also read: Composite Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.634లకే LPG గ్యాస్ సిలిండర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News