Amazon sale: ఇయర్ బడ్స్​పై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు- పూర్తి వివరాలివే..

Amazon sale: మొబైల్ యాక్సెసిరిస్​లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మొబైల్ యాక్సెసిరిస్​ డేస్​ పేరుతో నిర్వహిస్తున్న సేల్​లో భాగంగా ఈ ఆఫర్లు ఇస్తోంది. ఈ సేల్​లో డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 05:36 PM IST
  • అమెజాన్​లో మొబైల్ యాక్సెసిరిస్​లపై భారీ ఆఫర్లు
  • నేటితో ముగియనున్న స్పెషల్​ సేల్
  • 75 శాతం వరకు డిస్కౌంట్లు!
Amazon sale: ఇయర్ బడ్స్​పై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు- పూర్తి వివరాలివే..

Amazon sale: ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఎప్పుడు వినియోగదారులకోసం ఓ స్పెషల్​ సేల్​ నిర్వహింస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల మొబైల్ యాక్సెసరిస్​ డేస్​ సేల్​ను ఏప్రిల్​ 14న ప్రారంభించింది. ఈ సేల్ నేటితో (ఏప్రిల్ 17) ముగియనుంది.

ఏమిటి ఈ సేల్​?

ప్రతిసారి మొబైల్ ఫోన్లు, టీవీల వంటి వాటిపై డిస్కౌంట్లతో సేల్ నిర్వహించే అమెజాన్ ఈ సారి కాస్త భిన్నంగా.. యాక్సెసిరిస్​లకోసం ప్రత్యేక సేల్​ నిర్వహిస్తోంది. ఈ సేల్​లో స్మార్ట్​ఫోన్లకు అవసరమయ్యే అన్ని రకాల యాక్సెసిరిస్​లు.. అంటే బడ్స్​, పవర్​ బ్యాంక్స్​, ఛార్జర్లు, ఛార్జింగ్ కేబుల్స్​, బ్లూటూక్​ బ్యాండ్స్​ సహా ఇతర గాడ్జెట్స్​పై భారీ తగ్గింపు ఇస్తోంది అమెజాన్.

ఈ స్పెషల్​ సేల్​లో భాగంగా రూ.99 యాక్సెసిరిస్​ల కనీస ధరను రూ.99గా నిర్ణయించింది. అంతే కాదు.. ఈ స్పెషల్​ సేల్​లో కొన్ని యాక్సెసిరిస్​లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

యాపిల్​, వన్​ప్లస్​, ఒప్పొ, మివి, పిట్రోన్​, రియల్​మీ, బోట్​, జేబీఎల్​ సహా ఇతర అన్ని బ్రాండెట్​ కంపెనీల ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది అమెజాన్.

కొన్ని ఆఫర్లు ఇలా..

వన్​ప్లస్​ వైర్​లెస్​ జెడ్​2 బ్లూటూత్​ హెడ్​సెట్ ధర రూ.2,299 కాగా ఈ సేల్​లో దీనిని రూ.1,999కే సొంతం చేసుకునే వీలుంది.

ఒప్పొ ఎన్​కొ ఎం32 బ్లూటూత్​ ధరను రూ.1,699కి తగ్గించింది అమెజాన్. దీని అసలు ధర రూర.2,999.

వన్​ప్లస్​ బడ్స్​ జెడ్​2 ధరనూ రూ.5,999 నుంచి రూ.4,999కి తగ్గించింది.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్​ప్రో ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.17,990గా ఉండగా.. ఈ సేల్​లో రూ.8,490కే కొనుగోలు చేసే వీలుంది.

బ్యాంక్ ఆఫర్ కూడా..

ఈ సేల్​లో ఐసీఐసీఐ క్రెడిట్​, డెబిట్​ కార్డును ఉపయోగించి, అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే.. 10 శాతం తక్షణ క్యాష్​బ్యాక్​ను పొందొచ్చని అమెజాన్ తెలిపింది. కేవలం అమెజాన్​పే యూపీఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు రూ.50 క్యాష్​ బ్యాక్ లభిస్తుందని వివరించింది. వీటన్నింటితో పాటపు పోస్ట్​పే కార్డ్​తో చెల్లింపులు జరిపితే 10 శాతం (గరిష్ఠంగా రూ.200) తక్షణ క్యాష్​ బ్యాక్​ పొందొచ్చు.

Also read: Flipkart TV Days: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్ టీవీలు

Also read: GST Council: జీఎస్​టీ కనీస శ్లాబు 5 శాతం నుంచి పెంపు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News