Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కరోనా బారిన పడ్డారు.

Last Updated : Sep 13, 2020, 12:26 PM IST
Kotamreddy Sridhar Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కరోనా బారిన పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టెస్టులు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని (Kotamreddy Sridhar Reddy Tested COVID19 Positive) వైద్యులు నిర్ధారించారు. AP: శ్రీకాకుళం జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌

ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తనకు పాజిటివ్ అని విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. గత వారం రోజుల్లో తనను నేరుగా కలిసిన వారు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తనకు కరోనా నెగటివ్‌గా తేలే వరకు కలవడానికి ఎవరు రావొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించినట్లు సమాచారం. Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి.. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News