ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించిన షర్మిల

Last Updated : Apr 2, 2019, 08:35 PM IST
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ప్రశ్నలు సంధించిన షర్మిల

ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ షర్మిల టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం రోజు గుడివాడ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా నినాదం ఇప్పటి వరకు బదికి ఉందంటే అది వైసీపీ వాయిస్ వల్లేనని..హోదా క్రెడిట్ జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా గురించి జగనన్న ఎన్నిసార్లు పోరాటం చేశారో ప్రజలు తెలుసున్నారు.

ఎన్నికల భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకున్నారని షర్మిల ఎద్దేవ చేశరు. వాస్తవానికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడేలా చేసింది జగనేనని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. హోదా బదులు..ప్రత్యే ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్న విషయం నిజం కాదా...ప్యాకేజీ విషయంలో రాజీపడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది నిజం కాదా అంటూ చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు మాత్రం ఎన్నికల వరకు అధికారాన్ని అనుభవించారని షర్మిల విమర్శించారు
 

Trending News