జగన్ పై దాడికి కారణం టీడీపీ కుట్రే.. ఎందుకు ఆ సినీహీరో అమెరికా పారిపోయాడు?

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కచ్చితంగా టీడీపీ నాయకులు చేసిన కుట్రేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మీడియాకి తెలిపారు. 

Last Updated : Oct 30, 2018, 03:19 PM IST
జగన్ పై దాడికి కారణం టీడీపీ కుట్రే.. ఎందుకు ఆ సినీహీరో అమెరికా పారిపోయాడు?

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కచ్చితంగా టీడీపీ నాయకులు చేసిన కుట్రేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మీడియాకి తెలిపారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించారని.. అంత డబ్బు ఆయనకు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఆమె అన్నారు. ఆ డబ్బుతో భూమి కొనాలని భావించాడని.. కానీ టీడీపీ నేతలు తప్పును తిరిగి వైసీపీ నేతల వైపు నెట్టడానికి భావిస్తున్నారని రోజా తెలిపారు.

వీరు పదే పదే ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అలాగే సినీ హీరో శివాజీ ఎందుకు అమెరికా పారిపోయాడని ఆమె  అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ మంత్రుల మాటలు తనకు వెగటు కలిగిస్తున్నాయని రోజా తెలిపారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఆయన అభిమానినని చెప్పుకోవడం.. అలాగే డీజీపీ కూడా అదే మాట చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయాలని రోజా అన్నారు. 

కాగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హీరో శివాజీ అక్కడి నుండే ఓ వీడియో విడుదల చేశారు. ఆపరేషన్ గరుడపై వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. తన అభిప్రాయాలతో కూడిన సమాచారాన్నే గతంలో ఆపరేషన్ గరుడలో భాగంగా వ్యక్తం చేశానని అన్నారు. కానీ తనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని అంటున్నారని.. తాను అప్పులు ఎగ్గొట్టి పారిపోయిన మనిషిని కాదని శివాజీ తెలిపారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన దర్యాప్తులు చేసుకోవచ్చని  కూడా ఈ సందర్భంగా శివాజీ తెలిపారు.

Trending News