ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు వైసిపి మద్దతు

ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు వైసిపి మద్దతు

Last Updated : Oct 6, 2019, 10:45 AM IST
ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు వైసిపి మద్దతు

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సైది రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డిని కలిశారు. శనివారం గట్టు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు ఆ పార్టీకి మద్దతివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి తమ మద్దతు ఉంటుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో హుజూర్ నగర్‌లో తమ బలం, విజయావకాశాలు ఇంకొంత పెరిగినట్టేనని టీఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Trending News