నవ్యాంధ్రప్రదేశ్‌కి తొలి మహిళా సీఎస్‌గా నీలం సహాని

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సొంతం చేసుకోనున్నారు. రెండు రోజుల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం కార్యదర్శిగా సేవలు అందించిన నీలం సహానిని మొన్ననే కేంద్రం విధుల నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. 

Last Updated : Nov 14, 2019, 10:00 AM IST
నవ్యాంధ్రప్రదేశ్‌కి తొలి మహిళా సీఎస్‌గా నీలం సహాని

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సొంతం చేసుకోనున్నారు. రెండు రోజుల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం కార్యదర్శిగా సేవలు అందించిన నీలం సహానిని మొన్ననే కేంద్రం విధుల నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. 

Also read : ఏపీకి సీఎస్‌గా నీలం సహనీ ?

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే టెక్కలి సబ్ కలెక్టర్ గాను, నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ గాను సేవలు అందించారు. అదే విధంగా మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాద్‌లో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా పిడిడిఆర్డిఏగా, ఖమ్మం జిల్లాల్లో కాడా (CADA) అడ్మినిస్ట్రేటర్‌గాను విధులు నిర్వర్తించారు. తదుపరి ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలెక్టర్‌గాను, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా, టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. ఇవే కాకుండా క్రీడల శాఖ కమిషనర్, సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు.

ఆ తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత విభాగం కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Trending News