Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!

Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం తెలంగాణలోని నిజామాబాద్​కు చెందినదిగా గుర్తించారు పోలీసులు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 02:24 PM IST
  • కలకలం రేపుతున్న మరో కుటుంబం ఆత్మహత్య
  • విజయవాడలో తెలంగాణ కుటుంబం బలవన్మరణం
  • నిజామాబాద్​కు చెందిన వారిగా గుర్తింపు
Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!

Family suicide in Vijayawada: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో ఓ కుటుంబం మొత్తం బలవన్మరనానికి పాల్పడిన ఘటన (Palwancha family incident) కలకలం రేపుతుండగా.. ఆంధ్ర ప్రదేశ్​లోని విజయవాడలో అలాంటి ఘటనే మరొకటి తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఒకే కుటుంబంలోని.. నలుగురు విజయవాడలో ఆత్మ హత్యకు (Telangana Family Suicide in Vijayawada) పాల్పడ్డారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్​ నుంచి ఈ నెల 6న కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చారు పప్పుల సురేశ్​ కుటుంబం. పప్పుల సురేశ్​తో (Pappul Suresh Family Sucide) పాటు ఆయన భార్య పప్పుల శ్రీలత, ఇద్దరు కుమారులు (పప్పుల అఖిల్​, పప్పుల ఆశిష్​).. వన్​టౌన్​లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో రూమ్​ తీసుకుని అక్కడే బస చేశారు.

నిన్న రాత్రి తల్లి, చిన్న కుమారుడు విషయం తాగి సత్రంలోనే ఆత్మ హత్య చేసుకోగా, తండ్రి, పెద్ద కుమారుడు కృష్ణా నదిలో దూకి బలవన్మరనానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

అర్ధ రాత్రి సమాచారం.. అంతలోనే..

అయితే ఆత్మ హత్య చేసుకోవడానికి ముందు సురేశ్​ కుటుంబం తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీనితో అర్ధ రాత్రి సమయంలో వారి బంధువులు సత్రం సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బంది సురేశ్ కుటుంబం ఉన్న రూమ్​కు వెళ్లి చూశారు. అయితే అప్పటికే సురేశ్ భార్య అప్పుల శ్రీలత, చిన్న కొడుకు అప్పుల ఆశిష్​ విగత జీవులుగా పడి ఉన్నట్లు గుర్తించి కంగారు పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి తల్లి, కొడుకు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

కృష్ణా నదిలో దూకిన తండ్రి, కొడుకు అప్పుల అఖిల్​ మృతదేహాలను ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది గాలించి వెలికి తేశారు. వారి మృత దేహాలను సైతం పోస్ట్​మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. మృతుల వద్ద లభించిన ఆధారాలను సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: మా అక్కతో రాఘవకు అక్రమ సంబంధం.. సంచలనం రేపుతున్న నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..

Also read: పార్శిళ్లలో పందెం కోళ్లు... సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు... ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News