టీడీపీ మాజీ ఎంపీపై కేసు నమోదు

    

Last Updated : Oct 28, 2017, 03:52 PM IST
టీడీపీ మాజీ ఎంపీపై కేసు నమోదు

టీడీపీ మాజీ ఎంపీ మరియు టీడిపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరావుపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. సుంకర సుజాత అనే మహిళను నామా బెదిరించినట్లు, ఆమె నగ్నచిత్రాలను బయటపెడతానని చెప్పినట్లు వచ్చిన ఫిర్యాదులో భాగంగా పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం ఆ ఫిర్యాదుదారైన మహిళకు, నామాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణగా భావిస్తున్న ఆడియో అనేక మీడియా ఛానల్స్‌లో ప్రసారమవుతోంది. ఇదే విషయాన్ని బాధిత మహిళ ఫేస్బుక్‌లో పోస్టు చేసింది. గతంలో నామా తన సోదరుడితో పాటు సుంకర సుజాత ఇంటికి వచ్చి తనపై దాడికి ప్రయత్నించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై రెండు నెలల క్రితమే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదును న్యాయ నిపుణులు అభిప్రాయం కోసం పంపి, శాఖ నుండి ఆమోదం రాగానే ఇప్పుడు కేసు ఫైల్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఐపీసీ 506, 509 సెక్షన్ల క్రింద నామాపై కేసు నమోదు దర్యాప్తుకు ఆదేశించినట్లు జూబ్లీహిల్స్  పీఎస్ పోలీసు అధికారులు తెలిపారు. 

Trending News