AP: తాజాగా 8,846 కరోనా కేసులు.. 69 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. 

Last Updated : Sep 15, 2020, 08:06 PM IST
AP: తాజాగా 8,846 కరోనా కేసులు.. 69 మంది మృతి

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో ( సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు ) 8,846 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,83,925 కి చేరుకోగా.. ఇప్పటివరకు 5,041 మంది మరణించారు. Also read: Telangana: హవాలా ముఠా గుట్టురట్టు.. భారీగా సొమ్ము స్వాధీనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 92,353 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 4,86,531 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 70,511 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 47,31,866 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap corona bulletin

Also read: Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్

Trending News