Covid 19 : విషాదం.. ప్రాణం తీసిన కరోనా భయం.. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide over fear of Covid 19 : కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 10:54 AM IST
  • చిత్తూరులో కోవిడ్ పేషెంట్ ఆత్మహత్య
  • కరోనా భయంతో భవనం పైనుంచి దూకి బలవన్మరణం
  • పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనకు గురైన పేషెంట్
Covid 19 : విషాదం.. ప్రాణం తీసిన కరోనా భయం.. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide over fear of Covid 19 : కరోనా పట్ల ఇప్పటికీ చాలామందిలో లేనిపోని అపోహలు, భయాలు ఉన్నాయి. కరోనాతో దాదాపు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామందిలో అపోహలు, భయాలు తొలగిపోలేదు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో (Chittoor) చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే... కుప్పం పట్టణానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే వ్యక్తి మంగళవారం (జనవరి 18) రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణపాయం తప్పింది. అదే సమయంలో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అతనికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి తీవ్ర భయాందోళనకు గురైన అతను.. ఆసుపత్రి భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కిటికీ అద్దం పగలగొట్టి అతను కిందకు దూకినట్లు పోలీసులు (AP Police) వెల్లడించారు. కరోనా భయంతోనే విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని... ఈగటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెండేళ్ల క్రితం కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ సోకడంతో ఇక బతకడం కష్టమనే అపోహతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే విషయం.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికొస్తే.. మంగళవారం (జనవరి 18) కొత్తగా 6996 కరోనా కేసులు (Covid 19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384కి చేరింది. మరో నలుగురు కరోనాతో ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,514కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36108 యాక్టివ్ కేసులున్నాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య ఒక్కసారిగా 2888 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Khandev Temple: ఖాందేవ్ ఆలయంలో 'నూనె మొక్కు'.. 2.5 కిలోల నూనె తాగిన ఆదివాసీ మహిళ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News