Andhra Pradesh: డీజీపికి లేఖ రాసిన చంద్రబాబు

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాశారు. 

Last Updated : Dec 12, 2020, 01:08 PM IST
    1. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాశారు.
    2. తంబళ్లపల్లెలో జరిగిన దాడిపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
Andhra Pradesh: డీజీపికి లేఖ రాసిన చంద్రబాబు

Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాశారు. తంబళ్లపల్లెలో జరిగిన దాడిపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోంది అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Also Read | Postal Ballot : విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కొత్త పోస్టల్ విధానం?

తెలుగు దేశం పార్టీ (TDP) కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలని దాడులు చేస్తున్నారు అని ఆయన తెలిపారు. అలా చేస్తూ వారు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దుష్టశక్తులు రెచ్చిపోతున్నాయి అని తెలిపారు చంద్రబాబు.

దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అన్యాయంగా పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు అని తెలిపారు. ఏపీ మంత్రి పెద్ది రెడ్డి అరాచక శక్తులను పెంచిపోషిస్తున్నారు అని ఆరోపించారు చంద్రబాబు (Chandrababu Naidu). ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం సడలుతుంది అని తెలిపారు.

Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News