Sankranti special buses: సంక్రాతికి భారీగా స్పెషల్ బస్సులు- ఛార్జీలు బాదుడు కూడా..!

Sankranti special buses: సంక్రాతి పండుగకు ఇంటికి వెళ్లాలనుకునే ఏపీ ప్రజలకు గుడ్​ న్యూస్​. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీఎస్​ ఆర్​టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 10:05 AM IST
  • సంక్రాతికి ఊరెళదామనుకునే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్​
  • పండుగ నేపథ్యంలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్​టీసీ
  • హైదరాబాద్​కు 350కిపైగా ప్రత్యేక బస్సులు
Sankranti special buses: సంక్రాతికి భారీగా స్పెషల్ బస్సులు- ఛార్జీలు బాదుడు కూడా..!

Sankranti special buses: సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ కోసం ఏపీ ప్రజలు దేశంలో ఎక్కడున్న స్వస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్​ ఆర్​టీసీ (APS RTC latest news) కీలక నిర్ణయం తీసుకుంది.

పండుగకు బస్సుల్లో ఊరేళ్లేవారికోసం.. 1,266 ప్రత్యేక బస్సులు (Special buses for Sankranti) ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ఆర్​టీసీ తెలిపింది. విజయవాడ నుంచి సమీప రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ స్పెషల్​ బస్సులను నడిపించనున్నట్లు వెల్లడించింది.

స్పెషల్​ బస్సులు నడిచే రూట్లు..

ముఖ్యంగా హైదరాబాద్​, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్​​ బస్సులు నడవనున్నాయని ఏపీఎస్​ ఆర్​టీసీ వివరించింది.

ఇందులో ఒక్క హైదరాబాద్​కే 362 ప్రత్యేక బస్సులు కేటాయించడం (Sankranti special buses from Hyderabad) గమనార్హం. ఇక చెన్నై ఏపీ మధ్య 20, బెంగళూరు ఏపీ మధ్య 14 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్​టీసీ.

ఏపీలో విజయవాడ- విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మధ్య 390 ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఏపీఎస్ ఆర్​టీసీ తెలిపింది. విజయవాడ-రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య 120 ప్రత్యేక బస్సులు నడుస్తాయని వివరించింది. జనవరి 7 నుంచి 14 వరకు ఈ స్పెషల్​ బస్సులు నడుస్తాయని (Sankranti special buses Routes) వెల్లడించింది.

ధరల బాదుడు కూడా..

ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు గుడ్​ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్​టీసీ.. ఛార్జీలు పెంచుతున్నట్లు షాకిచ్చింది. సంక్రాంతి సీజన్​ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్​ ఛార్జీలు (Sankranti Bus Charges hike) పెంచుతున్నట్లు ప్రకటించింది.

బస్సుల్లో చివరి నిమిషంలో సీటు దొరుకుతుందో లేదో అనే టెన్షన్​ లేకుండా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్​టీసీ పేర్కొంది. ఏపీ.. ఆర్​టీసీ అధికారిక పోర్టల్​ ద్వారా టికెట్​ బుక్​ చేసుకోవచ్చని తెలిపింది.

Also read: TTD Darshan Tickets Booking: శ్రీవారి దర్శనం టికెట్లకు భారీ డిమాండ్.. గంటలో అమ్ముడైన స్పెషల్ దర్శనం టికెట్లు

Also read: Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు.. మొత్తంగా ఏపీలో 3 కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News