Zptc Election Notification: ఏపీలో మరో ఎన్నికల నగారా, విడుదలైన జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

Zptc Election Notification: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్  వెలువడింది. ఎన్నికలు నిలిచిన చోటి నుంచే ప్రక్రియ మొదలు కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2021, 09:39 PM IST
  • ఏపీలో జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన ఎస్ఈసీ నీలం సాహ్ని
  • ఈ నెల 8వ తేదీన పోలింగ్, 10వ తేదీన ఫలితాల వెల్లడి
Zptc Election Notification: ఏపీలో మరో ఎన్నికల నగారా, విడుదలైన జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్

Zptc Election Notification: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్  వెలువడింది. ఎన్నికలు నిలిచిన చోటి నుంచే ప్రక్రియ మొదలు కానుంది.

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమీషనర్‌గా బాథ్యతలు స్వీకరించిన రోజే తొలి ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించారు నీలం సాహ్ని. 2020 మార్చ్ నెలలో ప్రారంభమై కరోనా కారణంగా అప్పటి కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar) నిలిపివేసిన జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై నీలం సాహ్ని తొలిరోజే సమీక్షించారు. ఎన్నికల కమీషనర్‌గా తొలి నోటిఫికేషన్ వెలువరించారు. గతంలో నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ (Zptc Election notification)ఇచ్చారు. 

ఏపీలో ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట ఈ నెల 9వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చ్ 14 వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియన నిలిచిపోయింది. 

అంతకుముందు అంటే ఇవాళ ఉదయం కొత్త ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని(Neelam Sahni)..గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. తరువాత ఎస్ఈసీ నీలం సాహ్నిని ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చించుకున్నారు. జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై సమాలోచన చేశారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని సీఎస్ కోరారు. ఇందులో భాగంగా రేపు రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం జరగనుంది.

513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి

Also read: AP Zptc-Mptc Elections: జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎస్ఈసీ నీలం సాహ్ని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News