AP Panchayat Elections 2021: ఏపీ ఎస్ఈసీ E-Watch Appపై High Court కీలక నిర్ణయం, Nimmagadda Ramesh Kumarకు షాక్

AP Panchayat Elections 2021: ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 5, 2021, 04:52 PM IST
  • వైఎస్సార్‌సీపీ,టీడీపీలతో పాటు ఏపీ ఎలక్షన్ కమిషన్‌కు సైతం షాకులు
  • ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎపీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్
  • ఈ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు
AP Panchayat Elections 2021: ఏపీ ఎస్ఈసీ E-Watch Appపై High Court కీలక నిర్ణయం, Nimmagadda Ramesh Kumarకు షాక్

AP Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో పాటు ఏపీ ఎలక్షన్ కమిషన్‌కు సైతం షాకులు తగులుతున్నాయి. ఎన్నికల అంశాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎపీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్(E-Watch App)ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించింది.

 

ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇదివరకే ఉన్న నేపథ్యంలో మరో యాప్‌ను ఏపీ ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం సరికాదని రాష్ట్ర హైకోర్టు(AP High Court) అభిప్రాయపడింది. మరోవైపు ఈ వాచ్ యాప్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని, దాన్ని నిలిపివేయాలని అధికార వైఎస్సార్‌సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై AP SEC చర్యలు, నివేదిక కోసం ఆదేశాలు

ఏపీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ వాచ్ యాప్‌నకు భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందుకు మరో 5 రోజుల సమయం పడుతుందని చెప్పగా, ఈ నెల 9 వరకు ఈ వాచ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాకూడదని ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు షాకిచ్చింది. 

Also Read: AP Panchayat Elections ఫిర్యాదుల కోసం E-Netram App ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ

 

మరోవైపు చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరగడంపై ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల(AP Panchayat Elections 2021)పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకగ్రీవమైన పంచాయతీలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి తమకు సమర్పించాలని చిత్తూరు, గుంటూరు జిల్లాల అధికారులను ఆదేశించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News