హరికృష్ణ మృతికి నివాళిగా 2 రోజులు సంతాప దినాలు

2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ సర్కార్ 

Last Updated : Aug 30, 2018, 11:11 AM IST
హరికృష్ణ మృతికి నివాళిగా 2 రోజులు సంతాప దినాలు

నందమూరి హరికృష్ణ మృతికి సంతాపసూచికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న, ఇవాళ రెండు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సంతాప దినాలు అమలులో ఉన్న ఈ రెండు రోజులపాటు ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు జరపరాదని, అన్ని శాఖలు దీనిని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

Trending News