బ్రేకింగ్ న్యూస్: కోలంబోలో మరో బాంబు పేలుడు !!

Last Updated : Apr 24, 2019, 12:59 PM IST
బ్రేకింగ్ న్యూస్: కోలంబోలో మరో బాంబు పేలుడు !!

శ్రీలంక రాజధాని కోలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. సోవోయ్ సినిమా థియేటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. భద్రతాదళాల  అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే తాజా పేలుడుతో భారీగా ఆస్తినష్టం జరిగింది. వ్యాన్ లో భారీగా పేలుడు పధార్ధాలు తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్సీ హెచ్చరించడంతో ఆ దేశ సీఐడీ అధికారులు బాంబు ఘటన స్థలాన్ని గుర్తించి దాన్ని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఘటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ కుట్రకు ఐసిఎస్ ప్లాన్

తాజా పేలుడుతో శ్రీలంకలో బాంబు పేలుళ్ల సంఖ్య 8కి చేరింది. ఇప్పటి వరకు జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 362కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా శ్రీలంకలో మరన్ని దాడులకు ఐసీఎస్ కుట్ర ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్సీ హెచ్చరిండంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ పేలుళ్లు సంభవించిన నాటి నుంచి ప్రభుత్వం ఐసీసీ సానుభూతిపరులుగా  అనుమానించిన  120మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. 

Trending News