Mother killed by son: కనిపెంచిన తల్లిని సాకలేక చంపి బొందపెట్టాడు

Mother killed by son in Kamareddy district : నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మకు బిడ్డలే లోకం.. పిల్లలకు కాస్త నలత చేస్తే తాను కలత చెందుతుంది. వారి కళ్లలో నీళ్లు కనిపిస్తే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వారికి ఏ చిన్న బాధ కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి మాతృమూర్తిని వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకోవాల్సిన కన్న కొడుకే ఆమె పాలిట యముడై గొంతు నులిమి చంపేశాడు. ఈహృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో వెలుగులోకి వచ్చింది. 

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:36 AM IST

Mother killed by son in Kamareddy district : మండల కేంద్రానికి చెందిన ఇట్టబోయిన బాలవ్వ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నడవలేనిస్థితిలో ఉంది. దగ్గరుండి బాగోగులు చూసుకోవాల్సిన కుమారుడు చిన్న బాలయ్య ఆమెను భారంగా భావించాడు. ఈ నెల 13న రాత్రి చీరకొంగుతో గొంతు నులిమి చంపాడు. అక్కడే ఉన్న ఓ రైస్‌మిల్‌ వెనుక భాగంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. చుట్టు పక్కల వారికి అమ్మ కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు. అనుమానం వచ్చిన ఎంపీటీసీ సభ్యుడు బీరయ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా కన్న కొడుకే హతమార్చినట్లు తేలింది. ఘటనా స్థలిలో మృతదేహాన్ని వెలికి తీశారు. 

Video ThumbnailPlay icon

Trending News