మహిళా తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు

మహిళా తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు

Last Updated : Nov 4, 2019, 07:00 PM IST
మహిళా తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు

రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దార్ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. మహిళా తహశీల్దార్ విజయా రెడ్డిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో తహశీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనమయ్యారు. ప్రత్యక్షసాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు ఈ దాడిలో  పాల్పంచుకోగా వారిలో ఒకరికి మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడికి సమీపంలోని గౌరెల్లి గ్రామ నివాసిగా గుర్తించినట్టు సమాచారం అందుతున్నప్పటికీ... స్పష్టమైన వివరాలు ఇంకా తెలియరాలేదు. 

విజయా రెడ్డిపై దాడి సందర్భంగా ఆమెను రక్షించే ప్రయత్నం చేసిన మరో ఇద్దరు ఆఫీసు సిబ్బందికి సైతం తీవ్ర గాయాలైనట్టు అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Trending News