స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి!

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిని సోహిని సక్సేనా దుర్మరణంపాలయ్యారు.

Last Updated : Nov 26, 2019, 04:05 PM IST
స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి!

హైదరాబాద్‌: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిని సోహిని సక్సేనా దుర్మరణంపాలయ్యారు. బర్కత్‌పుర డిపోకు చెందిన బస్సు తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్టున్నారు.

Trending News