Balka Suman: తోలు తీస్తం బండి సంజయ్.. బీజేపీ అధ్యక్షుడిపై బాల్క సుమన్ ఆగ్రహం

Balka Suman On Bandi Sanjay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని హెచ్చరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2021, 10:39 AM IST
  • బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై బాల్క సుమన్ ఫైర్
  • కేసీఆర్ గురించి హేళన చేస్తే తోలుతీస్తాం అంటూ హెచ్చరించిన నేత
  • తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కూడా కేసీఆర్ పెట్టిన బిక్ష అన్న బాల్క సుమన్
Balka Suman: తోలు తీస్తం బండి సంజయ్.. బీజేపీ అధ్యక్షుడిపై బాల్క సుమన్ ఆగ్రహం

Balka Suman On Bandi Sanjay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని హెచ్చరించారు. పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న కొద్దీ తెలంగాణలో నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రం అవుతోంది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి దానికి సమయం, సందర్భం ఉంటుందని.. తాము ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రశాంతంగా ఉంటూ ఓపికతో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. అయితే తమ మంచి తనాన్ని బీజేపీ నేతలు, బండి సంజయ్ లాంటి నేతలు చేతగానితనం అనుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) గురించి ఏది మాట్లాడినా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే తోలు తీస్తామంటూ ఫైర్ అయ్యారు.

Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. ప్రతి మాటను లెక్కగట్టి మీతోనే కక్కిస్తామన్నారు. ఏం బలిసిందా.. ఎన్ని గుండెలు నీకు, చేతగాని మాటలు కట్టిపెట్టి.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు, కార్యక్రమాలు తెలుసుకోవాలని హితవు పలికారు. పని చేయడం చేతగానివాళ్లు కూడా సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేవారయ్యారా? అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay Kumar)‌ను ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Also Read: BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు 

 

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేతగానితనం వల్ల కరీంనగర్ కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ కర్ణాటక రాయచూర్ కి వెళ్ళిపోయిందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకపోతే ఆయనకు ఈ పదవి వచ్చేది కాదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతల తీరును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎండకట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News