ముగిసిన గడువు ; రాజస్థాన్ లో నామిషన్లు దాఖలు చేసిన ప్రముఖులు

                    

Last Updated : Nov 19, 2018, 06:27 PM IST
ముగిసిన గడువు ;  రాజస్థాన్ లో నామిషన్లు దాఖలు చేసిన ప్రముఖులు

రాజస్థాన్లో ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజున పలువురు ప్రముఖులు భారీ ఎత్తున నామినేషన్లు చేశారు. ఝలార్ పట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆపధార్మ ముఖ్యమంత్రి వసుంధర రాజే నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, నేతలతో ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన వసుంధర రాజే నామినేషన్ కు సంబంధించిన పత్రాలు సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సచిన్ పైలట్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు లోక్ సభకు మాత్రమే పోటీ చేస్తూ వచ్చిన సచిన్ పైలట్ తొలి సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కాగా సచిన్ పైలట్ పై పోటీగా రాజస్థాన్ రవాణామంత్రి యూనిస్ ఖాన్ ను బీజేపీ రంగంలోకి దించింది.

అలాగే మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు..సర్దార్ పూర్ నియోజకవర్గం నుంచి ఈయన బరిలోకి దిగుతున్నారు. గతంలో కూడా అశోక్ గెహ్లాట్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  కాగా మొత్తం 200 నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్ లో ఈ డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి 

Trending News