సాయిబాబా ఆలయంలో దారుణ హత్య; నగదుతో పరారీ !!

                                 

Last Updated : Oct 7, 2018, 01:02 PM IST
సాయిబాబా ఆలయంలో దారుణ హత్య; నగదుతో పరారీ  !!

భద్రాద్రి కొత్త గూడెంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టణ పరిధిలోని సాయిబాబా ఆలయంలో వాచ్ మెన్ ను అత్యంత దారుణంగా హతమార్చి హుండీలోని సొమ్ముతో పరారయ్యారు. స్థానికంగా ఈ ఘటన  సంచలనం రేకెత్తిస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం నిన్న( శనివారం) అర్థరాత్రి సమయంలో దోపిడి దొంగలు గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించారు. ఇది గమనించిన ఆలయ వాచ్ మెన్  వెంకటరెడ్డి  (70) వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.  దీంతో రెచ్చిపోయిన దొంగలు ..తమతో తీసుకొచ్చిన ఇనుప రాడ్డుతో అతని తలపై బలంగా మోదారు. ఈ దాడిలో వెంకటరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దొంగలు గుడిలోని హుండీలను పగులగొట్టి నగదుకు దోచుకుపోయారు.

ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ...దీన్ని గమనించి విషయాన్నిపోలీసులుకు తెలిపారు. దీంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గుడిలోని సీసీ కెమెరా ఫుటేజీని ఆధారం చేసుకొని ఇది  దోపిడీ దొంగల పనేనని నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం  నిందితుల కోసం గాలింపును చర్యలు ప్రారంభించారు. కాగా నిత్యం జన సంచారం ఉండే మార్గంలోని ఆలయంలో హత్య జరగడంపై స్థానికులకు ఉలికి పడేలా చేస్తోంది. 
 

Trending News