మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్వితే.. బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయి

మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా.. ఆ గుంతల్లో పురాతన బంగారు, వెండి నాణేలు బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని పూడూరులో చోటుచేసుకుంది. 

Last Updated : Jul 15, 2019, 12:35 PM IST
మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్వితే.. బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయి

జోగులాంబ గద్వాల: మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా.. ఆ గుంతల్లో పురాతన బంగారు, వెండి నాణేలు బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని పూడూరులో చోటుచేసుకుంది. చాకలి వెంకన్న అనే వ్యక్తి తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా..  అందులోంచి 11 బంగారు, 19 వెండి నాణేలు బయటపడ్డాయి. పురాతన బంగారు, వెండి నాణేలు లభ్యమైన విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే వెంకన్న ఇంటికి చేరుకుని ఆ బంగారు, వెండి నాణేలు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Trending News