Delhi Liquor Scam: ఈడీపై విమర్శలు గుప్పించిన కవిత, లేఖ రాసి విచారణకు హాజరు

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 02:49 PM IST
Delhi Liquor Scam: ఈడీపై విమర్శలు గుప్పించిన కవిత, లేఖ రాసి విచారణకు హాజరు

Delhi Liquor Scam: డిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండవరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. పాత ఫోన్లతో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.  

ఢిల్లీ మద్యం కేసు విషయంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఇప్పటికి రెండుసార్లు కవితను విచారించింది. ఇవాళ మూడవసారి విచారిస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ్టి విచారణకు హాజరవుతూ.. అధికారి జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత తాను రాసిన లేఖను విడుదల చేశారు. పాత ఫోన్లను ఈడీకు సమర్పించడం ద్వారా తనపై చేసిన ఆరోపణలు అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. 

ఈడీ అధికారి జోగేంద్రకు రాసిన లేఖలో తీవ్రంగా విమర్శించారు కవిత. తనపై ఫోన్ల ధ్వంసం ఆరోపణలు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో ఈడీ తనపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని చెప్పారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కల్గించదా అని కవిత ప్రశ్నించారు.

ఈడీ దుర్బుద్ధితో వ్యవహరిస్తూ ఫోన్లను ధ్వంసం చేశానంటోందని..కనీసం తనను అడగకుండా..ఏ పరిస్థితుల్లో ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని లేఖ ద్వారా ప్రశ్నించారు. తనను తొలిసారి ఈడీ మార్చ్ నెలలో విచారణకు ఈడీ పిలిచిందని..కానీ గత ఏడాది నవంబర్ నెలలోనే తాను ఫోన్లు ధ్వంసం చేసినట్టుగా ఈడీ ఆరోపించిందంటే అది దురుద్దేశ పూర్వకంగా చేసిన తప్పుడు ఆరోపణలేనని కవిత తెలిపారు. 

ఈడీ తనపై చేసిన తప్పుడు ఆరోపణల్ని ఉద్దేశ్యపూర్వకంగా లీకేజ్ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్ధులు తనను ప్రజల సమక్షంలో నిందిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలగడమే కాుండా తన పరువు, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేసిందన్నారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగించాలనే నిబంధనను పక్కనబెట్టి..రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 

ఇవాళ వరుసగా మూడవసారి ఈడీ విచారణకు హాజరైన కవిత..తన పాత ఫోన్లను ఈడీకు సమర్పిస్తూ..ఈ లేఖను విడుదల చేశారు. ఈడీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ఇదే స్కాంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని సైతం విచారిస్తుండటం గమనార్హం. 

Also read: Delhi liquor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News