Telangana: తాజాగా 2,103 కరోనా కేసులు.. 11 మంది మృతి

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ రెండువేల మార్కును దాటుతున్నాయి.

Last Updated : Sep 30, 2020, 11:07 AM IST
Telangana: తాజాగా 2,103 కరోనా కేసులు.. 11 మంది మృతి

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి రెండువేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త మళ్లీ రెండువేల మార్కును దాటుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 29 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 11 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,127 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,60,933 మంది బాధితులు కోలుకున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో 29,326 మంది చికిత్స పొందుతున్నారు. Also read: TS ICET Exam 2020: నిమిష్యం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం 55,359 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 29,96,001 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 84.08 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. 

అయితే నిన్న అత్యధికంగా అత్య‌ధికంగా జీహెచ్ఎసీ ప‌రిధిలోనే 298 కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లాలో 172, న‌ల్ల‌గొండ‌ జిల్లాలో 141, క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో 103, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 102, ఖ‌మ్మం జిల్లాలో 93, సిద్దిపేట‌ జిల్లాలో 92 చొప్పున అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News