స్టేడియంలో గుండెపోటుతో కన్నుమూసిన క్రికెటర్!

స్టేడియంలో గుండెపోటుతో కన్నుమూసిన క్రికెటర్!

Last Updated : Jan 13, 2019, 07:20 PM IST
స్టేడియంలో గుండెపోటుతో కన్నుమూసిన క్రికెటర్!

గోవా రంజి ట్రోఫి క్రికెటర్ రాజేశ్ ఘోడ్గె గుండెపోటుతో కన్నుమూశారు. మార్గావోలోని రాజేంద్ర ప్రసాద్ స్టేడియంలో జరుగుతున్న స్థానిక టోర్నమెంట్‌లో పాల్గొన్న రాజేష్‌కి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. గతంలో గోవా రంజీ జట్టు క్రికెటర్ అయిన రాజేశ్ వయస్సు 47 ఏళ్లు. ఎంసీసీ ఛాలెంజర్స్, ఎంసీసీ డ్రాగాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 

ఎంసీసీ ఛాలెంజర్స్ జట్టు తరపున బ్యాటింగ్‌కి దిగిన రాజేశ్ అప్పటికే 31 పరుగులు చేసి నాన్-స్ట్రైకర్ వైపు బ్యాట్ పట్టుకుని వున్నాడు. ఎంపరర్ పక్కన క్రీజులో నిల్చున్న రాజేశ్ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడని అతడిని సమీపంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి అక్కడి నుంచి, అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Trending News