ఐపీఎల్ 2018 : వాంఖడే సాక్షిగా మొదలైన క్రీడా సంరంభం.. MI vs CSK

వాంఖడే సాక్షిగా మొదలైన క్రీడా సంబరం.. MI vs CSK 

Last Updated : Apr 8, 2018, 01:01 AM IST
ఐపీఎల్ 2018 : వాంఖడే సాక్షిగా మొదలైన క్రీడా సంరంభం.. MI vs CSK

ఐపీఎల్ 2018 పోటీల్లో తొలి మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అయిన ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోటీ పడుతోంది. ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మ కెప్టేన్‌గా వ్యవహరిస్తుండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టేన్‌గా మహేంద్ర సింగ్ ధోని వున్నాడు. ఐపీఎల్లో బెట్టింగ్ స్కామ్ కారణంగా రెండేళ్లపాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిషేధం తర్వాత తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడుతున్న మ్యాచ్ ఇదే. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న ఎం.ఎస్. ధోనీ ముంబై ఇండియన్స్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో మంచి సక్సెస్‌ రేటు వున్న రోహిత్ శర్మ నేతృత్వం వహిస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టుకు, అంతే సమానమైన ట్రాక్ రికార్డు వున్న ఎం.ఎస్. ధోనీ నాయకత్వంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులని రక్తి కట్టించడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. 

CLICK HERE FOR IPL MUMBAI INDIAN VS CHENNAI SUPER KINGS LIVE SCORE

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయేలా చేసే పోటీలుగా ఈ ఐపీఎల్‌కి పేరుంది. అందుకు కారణం ప్రపంచ దేశాల నుంచి పేరున్న ప్రముఖ క్రికెటర్లు ఈ ఐపీఎల్ జట్లలో పోటాపోటీగా ఆడటమే. మరి ఈ సీజన్‌లో జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూద్దాం.

Trending News