రెండో రోజూ ఆట ప్రారంభం: భారత్ స్కోర్ 75/5

 రెండో రోజూ ఆట ప్రారంభం: కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 75/5

Last Updated : Nov 17, 2017, 11:43 AM IST
    • రెండో రోజు ఆట ప్రారంభం
    • కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 75/5
రెండో రోజూ ఆట ప్రారంభం: భారత్ స్కోర్ 75/5

భారత్-శ్రీలంక  మధ్య  జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో రెండో రోజు ప్రారంభమైంది. మొదటి రోజు వర్షం కారణంగా  ఆట ముగిసే సమయానికి టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 17 పరుగులు తీసింది.

రెండో రోజు ఆట ఆరంభంలోనే భారత ఆటగాడు రహానే వికెట్ కోల్పోయాడు. షహానా బౌలింగ్ లో డెక్విల్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రహానే స్థానములో రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ కు దిగాడు. అశ్విన్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు.  కడపటి వార్తలు అందేసరికి భారత్ 32.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 47*, సాహా 6* ఉన్నారు. పుజారా ఒక్కడే క్రీజ్ లో నిలబడి 102 బంతుల్లో 47 పరుగులు చేసి అర్థ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

Trending News