న్యూజీలాండ్ టూర్: భారత్ జట్టు ఎంపిక

దిగ్విజయంగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో ఊపుమీదున్న కోహ్లీసేన, సుదీర్ఘ కాలం తరవాత న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా టీమిండియా ఇప్పటికే ఆక్లాండ్‌ చేరుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంగళవారం తన సహచరులైన శార్దూల్‌ ఠాకుర్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా

Last Updated : Jan 21, 2020, 11:41 PM IST
న్యూజీలాండ్ టూర్: భారత్ జట్టు ఎంపిక

ముంబయి: దిగ్విజయంగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో ఊపుమీదున్న కోహ్లీసేన, సుదీర్ఘ కాలం తరవాత న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా టీమిండియా ఇప్పటికే ఆక్లాండ్‌ చేరుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంగళవారం తన సహచరులైన శార్దూల్‌ ఠాకుర్‌, శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితమే బీసీసీఐ న్యూజిలాండ్‌తో తలపడే వన్డే జట్టును ప్రకటించింది. ఇందులో ధావన్‌కు చోటివ్వలేదు. 

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధావన్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధావన్ను ఎంపిక చేయలేదు. న్యూజీలాండ్ తో భారత్ ఐదు టీ20లు, 3 వన్డేలు, రెండు రెండు టెస్టులు ఆడనుంది. కాగా, మొదటి టీ20 ఆక్లాండ్లోని ఈడెన్ పార్కులో ఈ నెల 24న జరుగనుంది.

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవ్‌దీప్‌ సైని, శార్దూల్‌ ఠాకుర్‌, కేదార్‌ జాదవ్‌. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News