నాగ్పూర్ మ్యాచ్: రెండో టెస్టులో విజయం దిశగా టీమిండియా

శ్రీలంకపై భారత బౌలర్లు బౌలింగ్ తో చెరిగిపోతున్నారు. 21/1 ఓవర్ నైట్ స్కొర్ తో నాగ్ పూర్ లో సోమవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  శ్రీలంకకు భారత బౌలర్లు జడేజా, ఇషాంత్ శర్మ బౌలింగ్ తో విజృంభించారు.

Last Updated : Nov 27, 2017, 12:07 PM IST
నాగ్పూర్ మ్యాచ్: రెండో టెస్టులో విజయం దిశగా టీమిండియా

నాగ్పూర్: శ్రీలంకపై భారత బౌలర్లు బౌలింగ్ తో చెరిగిపోతున్నారు. 21/1 ఓవర్ నైట్ స్కొర్ తో నాగ్పూర్ లో సోమవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  శ్రీలంకకు భారత బౌలర్లు జడేజా, ఇషాంత్ శర్మ బౌలింగ్ తో విజృంభించారు. ఓవర్ నైట్ ఆటగాడు కరుణరత్నే(18 పరుగులు)ను జడేజా పెవిలియన్ అవుట్ చేసి శుభారంభం ఇవ్వగా.. ఆతరువాత కొద్ది సేపటికి తిరుమన్నే (23 పరుగులు)ను ఇషాంత్ అవుట్ చేసాడు. అలానే మ్యాథ్యూస్ (10) ను జడేజా అవుట్ చేసాడు. 

కాగా అప్పటికే నాలుగు వికెట్ల నష్టానికి శ్రీలంక 68 పరుగులు చేసింది. ఆతరువాత ఏడు పరుగులు చేసిన డిక్వెల్లా(4 పరుగులు) ను ఇషాంత్ అవుట్ చేసాడు. శ్రీలంక జట్టు ఇంత పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. భారత్ విజయం ఖాయమనే చెప్పవచ్చు. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ స్కోర్ 205 కు ఆలౌట్. భారత్ 610/6 కు ఆదివారం డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే..!

Trending News