Shardiya Navratri 2023: ఏనుగు సవారీపై దుర్గదేవి..30 ఏళ్ల తర్వాత శారదీయ నవరాత్రుల్లో శుభమూహుర్తం..

Shardiya Navratri 2023: శారదీయ నవరాత్రుల్లో భాగంగా కలశ స్థాపన చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత శారదీయ నవరాత్రులు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2023, 02:55 PM IST
Shardiya Navratri 2023: ఏనుగు సవారీపై దుర్గదేవి..30 ఏళ్ల తర్వాత శారదీయ నవరాత్రుల్లో శుభమూహుర్తం..

 

Shardiya Navratri 2023: శారదీయ నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ మాసంలో ఈ నవరాత్రలు వస్తాయి. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే విశేషమేమిటంటే చిత్రా నక్షత్రం, బుధాదిత్య, వైధృతి యోగంలో  నవరాత్రులు ప్రారంభం కాబోతోంది.  30 ఏళ్ల తర్వాత ఇలా రావడం మొదటి సారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గత సంవత్సరం లాగే దుర్గదేవి  ఏనుగు సవారీతో రాబోతోంది. దీంతో ఏడాది పొడవునా శుభకార్యాలతో పాటు సరిపడా వర్షాలు కురుస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

నవరాత్రులలో మొదటి రోజు మంగళవారం లేదా శనివారం అయితే గుర్రంపై, బుధవారమైతే పడవపై, గురు, శుక్రవారం అయితే డోలీపై స్వారీ అమ్మవారు వస్తుండేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అమ్మవారు గుర్రం బండిపై స్వారీ చేస్తూ రావడం మంచిదని కాదని కూడా వారంటున్నారు. దీని కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి నష్టం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం దుర్గామాత ఏనుగుపై రావడం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కలశ స్థాపనకు అనుకూల సమయం:
నవరాత్రులలో భాగంగా కలశ స్థాపన ఎంతో ముఖ్యమైనది..నవరాత్రులలో మొదటి రోజున కలశ స్థాపన ఉదయం 11.44 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శుభ ముహూర్తామేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మొత్తం ఈ కాల వ్యవధి 46 నిమిషాలు ఉంటుదన్నారు. 

ఘటస్థాపన సమయంలో తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
నవరాత్రులలో కలశ స్థాపనను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కలశ స్థాపనకు ఉత్తమ సమయం అభిజిత్ ముహూర్తమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. వైధృతి యోగ సమయంలో కలశ స్థాపన చేయడం మానుకుంటే చాలా మంచిది. మూల, శ్రావణ, దానిష్ఠ, ఉత్తరాభాద్రపద, అశ్వని, రోహిణి, ఉత్తరాషాఢ, పునర్వసు, పుష్య, హస్త నక్షత్రాల్లో జన్మించినవారు కలశ స్థాపన చేయడం చాలా శుభప్రదమని శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు.   

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News