Unified Pension Scheme: మాకు వద్దే వద్దు.. ఈ రాష్ట్రంలో యూపీఎస్‌పై ఉద్యోగుల్లో భారీ వ్యతిరేకత..!

UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
 

1 /6

ఈ సందర్భంగా 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విన్నవించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

2 /6

అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకురేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు.  

3 /6

పెన్షన్ విధానం అమలుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చెప్పారు.  

4 /6

ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఉందని.. త్వరలోనే మంచి నిర్ణయం ఉంటుందన్నారు.  

5 /6

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి అన్నారు.  

6 /6

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులకు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని అన్నారు.