Wax statues at Madame tussauds: మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువైన ఇతర భారతీయ నటీనటులు వీళ్లే.. పార్ట్ 2

Wax statues at Madame tussauds: మేడమ్ టుస్సాడ్స్‌ ముందుగా లండన్‌లో కొలువైంది. అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన
ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఫేమస్ అయింది. దీంతో ఈ మ్యూజియాన్ని సందర్శించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముందుగా మన దేశంలో అమితాబ్ బచ్చన్ విగ్రహం ఈ మ్యూజియంలో కొలువైంది. తాజాగా అల్లు అర్జున్ సహా ఎంతో మంది భారతీయ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను అక్కడ కొలువు తీరాయి.

1 /5

సల్మాన్ ఖాన్.. అటు సల్మాన్ ఖాన్ మైనపు విగ్రహాం లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్‌లో కొలువు తీరింది.

2 /5

హృతిక్ రోషన్.. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ మైనపు విగ్రహాన్ని కూడా మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరింది. అటు బాలీవుడ్ నుంచి వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, కరణ్‌ జోహార్ సహా పలువురు మైనపు విగ్రహాలు అక్కడ కొలువు తీరాయి.

3 /5

కాజల్ అగర్వాల్.. అటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా సత్తా చాటిన నార్త్ భామ కాజల్ అగర్వాల్.. మైనపు విగ్రహంగా కొలువైన తొలి సౌత్ స్టార్.

4 /5

శ్రీదేవి.. అటు అతిలోకసుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆమె చనిపోయిన తర్వాత.. మిస్టర్ ఇండియాలోని శ్రీదేవి గెటప్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈమె కంటే ముందు ఐశ్వర్యా రాయ్, ప్రియాంక  చోప్రా, కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజోల్, అనుష్క శర్మ, దీపికా పదుకొణే, సన్ని లియోని మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్‌లో కొలువు తీరాయి.

5 /5

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అటు రాజకీయాల నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుతీరిన ఏకైక భారతీయ రాజకీయ వేత్త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే. అందులో మహాత్మ గాంధీ, ఇందిరా సహా వివిధ దేశాధినేతల మైనపు విగ్రహాలను వాళ్ల చనిపోయిన తర్వాత కొలువు తీరడం విశేషం.