Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1 /7

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలోకి విగ్రహాంను ఇటీవల ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేశాడు.ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో హిందుసంఘాలన్ని దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే సలీంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ లో ఈరోజు (శనివారం) బంద్ కు పిలుపునిచ్చారు.

2 /7

ఇటీవల లేడీ నాగ సాధు ముత్యాలమ్మ ఆలయంకు వచ్చారు. అక్కడ అమ్మవారి ముందు ఒక కాలిపై నిలబడి ప్రత్యేకంగా పూజలు సైతం చేశారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలీదు. 

3 /7

ఒంటి నిండా బూడిద, పుర్రెల మాలలు, దిగంబరంగా ఉండటం కన్పిస్తుంది. ముఖ్యంగా అఘోరీ మాత మాట్లాడుతూ.. ఇతర మతాలను గౌరవిస్తునే సనాతన ధర్మంను కాపాడుకొవాలన్నారు. అంతేకాకుండా..ప్రతి ఒక్కరు ఇలాంటి ఘటనపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

4 /7

అయితే.. తాను.. ఏడేళ్ల వయస్సులో కాశీకి వెళ్లి అఘోరీగా మారానని చెప్పుకొచ్చారు. ఏన్నోఏళ్లు కఠోరంగా ఉన్న తర్వాత నాగసాధులుగా, అఘోరీలుగా మారతారని చెప్పింది. శవాల మధ్యన ఉంటూ, శవాలను తింటామని చెప్పింది. ఇప్పటి దాక వెయ్యికి పైగా శవాలు తిన్నట్లు చెప్పారు.

5 /7

తనకు తానుగా.. 20 ఏళ్ల క్రితమే పిండ ప్రదానం కూడా  చేసుకున్నట్లు చెప్పారు. తమకు ఎవరి మీద వ్యామోహం ఉండదని కూడా చెప్పుకొచ్చారు. కేవలం శివనామస్మరణం మాత్రమే నిరంతరం చేస్తు ఉంటామని చెప్పుకొచ్చారు.

6 /7

అయితే.. పీరియడ్స్ అఘోరీలకు వస్తాయా.. అని కొంత మంది ప్రశ్నించగా.. అందరి మహిళల మాదిరిగానే పీరియడ్స్ వస్తాయని లేడీ అఘోరీ చెప్పారు. ఆ సమయంలో కూడా బూడిద పూసుకుని స్మశానంలో ఉంటామని చెప్పుకొవచ్చారు.ఆ ఐదు రోజులు మాత్రం పూజలకు దూరంగా ఉంటామని కూడా లేడీ అఘోరీ చెప్పుకొచ్చింది.

7 /7

తన గురువు కాశీ విశ్వనాత్ ఆధ్వర్యంలో తాను.. అఘోరీగా మారినట్లు వెల్లడించారు. ఆమె ప్రయాణిస్తున్న  కారు మీద డెంజర్ లేడీస్ డేంజన్ అని కూడా రాసి పెట్టిఉంది. దానిలో పుర్రెలున్నాయి. అఘోరీ మాత కారుకు చెందిన వీడియో కూడా వార్తలలో నిలిచింది.