Telangana: భాగ్యనగరంలో యథేచ్ఛగా కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కూడా భాగ్యనగర వాసులు సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్కులు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారు. 
  • Nov 19, 2020, 14:31 PM IST

Hyderabad People violating social distancing without face masks: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కూడా భాగ్యనగర వాసులు సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్కులు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారు. 

1 /4

హైదరాబాద్ మార్కెట్ల పరిసరాల్లో ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుతుండటంతోనే.. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల హాడావుడి మొదలైంది. ఓ ప్రచారం.. మరో వైపు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన వల్ల కేసుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

2 /4

ఇదిలాఉంటే... రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 1058 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు (4) మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,60,834 కి చేరగా.. మరణాల సంఖ్య 1,419 కి పెరిగింది. ఇప్పటివరకు 2,46,733 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,682 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   

3 /4

అయితే నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి బుధవారం నాటి ఫొటోలను వార్త సంస్థ ఎఎన్ఐ (ANI) ట్విట్టర్‌లో పంచుకుంది. 

4 /4

హైదరాబాద్ పరిసరాల్లో ఇలా మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఇప్పటికైనా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని వేడుకుంటున్నారు.