Glacier Melting: దేశంలో వేగంగా కరుగుతున్న గ్లేసియర్లు, పెరుగుతున్న ముప్పు

Glacier Melting: భారతదేశ మకుటంపై కిరీటంలా ఉన్న హిమాలయ మంచు కొండలు వేగంగా కరుగుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే పరిణామంగా మారుతోంది. గ్లేసియర్లు కరుగుతుండటంతో ముప్పు పెరుగుతోంది. దేశంలోని 4 రాష్ట్రాల్లో దాదాపుగా 34 అతి పెద్ద గ్లేసియర్లున్నాయి. ఇవి కరుగుతుండటం ఆందోళళ రేపుతోంది.

Glacier Melting: భూమిపై పలు జీవనదులు ఈ గ్లేసియర్లలోనే జన్మించాయి. గ్లోబల్ వార్మింగ్ , క్లైమేట్ ఛేంజ్ కారణంగా బ్లాక్ కార్బన్ ఎటాక్ వల్ల హిమాలయాల్లో గ్లేసియర్లు అత్యంత వేగంగా కరుగుతున్నాయి. కోట్లాదిమంది జీవితాలకు ముప్పు వెంటాడనుంది.
 

1 /5

ఖాట్మండూలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ నివేదిక ఆందోళన కల్గిస్తోంది. రానున్న కాలంలో ఆకశ్మిక వరదలు, వర్షాల ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ గ్లేసియర్ల నుంచే గంగా, యమునా, అలకానంద, పిండారీ ఇతర నదులు ప్రవహిస్తున్నాయి. 

2 /5

గ్లేసియర్లు కరగడం చాలా ప్రమాదకర పరిస్థితి. గ్లేసియర్లు కరగడం వల్ల జీవనదులు భవిష్యత్తులో ఇంకిపోతాయి. ఫలితంగా నీటి కొరత, ధాన్యం కొరత అన్నీ వెంటాడుతాయి. గ్లేసియర్లు వేగంగా కరగడం వల్లనే వరదలు కూడా సంభవిస్తున్నాయి.

3 /5

ఈ గ్లేసియర్లపై నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ దృష్టి సారించింది. గ్లేసియర్లు కరగడంపై ఇస్రో పరిశీలిస్తోంది. 

4 /5

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ, చమోలీ, పిథౌరీగఢ్ , అల్మోడా ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయి. గంగోత్రి గ్లేసియర్ ఇందులో ఒకటి. ఇది అత్యంత వేగంగా కరుగుతోంది. జలవాయు మార్పులు గ్లేసియర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ గ్లేసియర్లు వెనక్కి కుంగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 15 ఏళ్లలో దాదాపుగా 0.23 స్క్వేర్ కిలోమీటర్ల గ్లేసియర్లు వెనక్కి జరిగాయి.

5 /5

వాతావరణంలో మార్పు ప్రభావం హిమాలయ గ్లేసియర్లపై పడుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6 ప్రముఖ గ్లేసియర్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో గ్లేసియర్ వేగంగా కరుగుతోంది. లడాఖ్, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉన్న గ్లేసియర్లు వేగంగా పెరుగుతున్నాయి.