Telangana: హైవేపై బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 15 మంది గాయాలు, ముగ్గురికి సీరియస్..

Bus Accident: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 09:18 AM IST
Telangana: హైవేపై బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 15 మంది గాయాలు, ముగ్గురికి సీరియస్..

Telangana Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా నేషనల్ హైవే-44 ఈ ప్రమాదం జరిగింది. 

వివరాల్లోకి వెళితే..
యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మెుత్తం 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జయన్న (బద్వేల్), షబ్బీర్ (కర్నూల్), నరసింహ(కేశంపేట), శ్రీకాంత్(హన్మకొండ), కృపానంద (హైదరాబాద్), షకీల(రాయచోటి), ఉపేందర్ (జనగామ), అర్జున(కర్నూలు), సుమలత (ఆళ్లగడ్డ), రఫీక్ (షాద్ నగర్)లు ఉన్నారు. 

క్షతగాత్రుల్లో షకీల, షబ్బిర్, నరసింహ పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మెుత్తం 37 మంది ఫ్యాసింజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Syria earthquake: కన్నీళ్లు పెట్టిస్తున్న సిరియన్ బాలిక ఫోటో.. రక్త సంబంధం అంటే ఇదేనేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News