Jd Lakshminarayana: బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ?


Jd Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది బీఆర్ఎస్. కాపు బలిజ నేతల పై కేసీఆర్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పని చేసిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది.

  • Zee Media Bureau
  • Feb 3, 2023, 05:57 PM IST


Jd Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది బీఆర్ఎస్. కాపు బలిజ నేతల పై కేసీఆర్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనలో కీలక నేతగా పని చేసిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పగ్గాలు అప్పగించింది. తాజాగా ఏపీకి సంబంధించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణలు బీఆర్ఎస్ లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. గంటా శ్రీనివాస రావు, లక్ష్మీనారాయణను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని.. కేసీఆర్ దూతగా విశాఖలో ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News