రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ జీహెచ్ఎంసీ, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పురపాలిక అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
Telangana Rains: భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష.. సహాయక చర్యలను వేగం చేయాలని ఆదేశాలు!